భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అలర్ట్గా ఉండాలి: కలెక్టర్ అభిలాష అభినవ్

భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అలర్ట్గా ఉండాలి: కలెక్టర్ అభిలాష అభినవ్

లక్ష్మణచాంద, వెలుగు: భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అలర్ట్​గా ఉండాలని నిర్మల్ కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. సోమవారం లక్ష్మణచాంద మండలం కనకాపూర్​లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాన్ని కలెక్టర్ సందర్శించారు. కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, జాగ్రత్తలు పాటించాలని సూచించారు. కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలన్నారు. 

పరిసరాల్లో చెత్త, నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు. గ్రామంలో జ్వరాల బారిన పడిన వారి వివరాలు, అందిస్తున్న వైద్య సేవలపై వైద్యాధికారులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఫీవర్ సర్వే నిర్వహించి డెంగ్యూ,మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులను గుర్తించి తగిన చికిత్స అందించాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. కార్యక్రమంలో డీఎంహెచ్​వో రాజేందర్, మండల ప్రత్యేక అధికారి అంబాజీ, తహసీల్దార్ సరిత, ఎంపీడీవో రాధ తదితరులు పాల్గొన్నారు.